
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
చిన్నారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): గ్రామీణ ప్రాంతంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లిలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని కూచన్పల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. దరఖాస్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందన్నారు. రైతుల నుంచి అవసరమైన అర్జీలు స్వీకరించి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ధ్రువపత్రాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సింధూరేణుక, గిర్దావర్ ఆబేద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్మాణాలకు జీరో పర్మిట్ సిస్టంతో కాంట్రాక్టర్లకు అవసరమైన ఇసుక, కంకర, మినరల్స్ను ఆన్లైన్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పి ంచాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్రియాశీలకంగా పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అనంతరం సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈనెల 16న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రైతునేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్రాజ్