పల్లె పాలన! | - | Sakshi
Sakshi News home page

పల్లె పాలన!

Jun 14 2025 10:00 AM | Updated on Jun 14 2025 10:00 AM

పల్లె పాలన!

పల్లె పాలన!

పడకేసిన

కార్మికులకు జీతాలు కరువు

రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాకపోవడంతో వారు సైతం పనులు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పంచాయతీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే పల్లెల్లో వివిధ రకాల పన్నులు వసూలు అయినప్పటికీ వాటిని నేరుగా ఉపయోగించేందుకు వీలు లేదు. పంచాయతీ అకౌంట్‌లో జమ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. అలా అకౌంట్‌లో జమచేసిన మరుక్షణమే ఫ్రీజింగ్‌లోకి వెళ్లిపోతున్నాయని, దీంతో ఆ డబ్బులను వాడుకునే అవకాశం లేకుండా పోయిందని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 493 గ్రామాలు ఉండగా, 7 లక్షల పైచిలుకు జనాభా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. ఆ వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. పాలకవర్గాలు లేకపోవడంతో 16 నెలలుగా పంచాయతీలకు కేంద్రం నుంచి పైసా విడుదల కాలేదు. స్పెషలాఫీసర్లు జీపీల ముఖం చూడటం మానేశారు. దీంతో భారమంతా కార్యదర్శులపైనే పడింది. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లలో డీజిల్‌, వీధి దీపాలు, మోటార్ల రిపేర్లు, మురికి కాలువల వెంట గడ్డి మందు పిచికారీ, దోమలకు ఫాగింగ్‌, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు సైతం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో చెత్త ట్రాక్టర్ల నిర్వహణ మాతో కాదంటూ తాళాలను ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఏ ఇతర పనులు చేపట్టబోమంటూ తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా గతేడాది సెప్టెంబర్‌లో పచ్చదనం.. స్వచ్ఛదనం కింద 2 వేల జనాభాకుపైగా ఉన్న జీపీలకు రూ. 75 వేలు, అంతకంటే తక్కువ ఉన్న పంచాయతీలకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా, అవి నేటికీ విడుదల కాకపోవటం గమనార్హం.

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల ముప్పు

ప్రస్తుతం వానాకాలం ప్రారంభం కావటంతో పారిశుద్ధ్య నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సీజనల్‌ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. తాగునీటి నల్లాల లీకేజీలను అరికట్టకపోయినా, మురికి కాలువల వెంట చెత్తా చెదారం తొలగించకపోయినా, ఈగలు, దోమలకు ఆవాసం ఏర్పడి మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

16 నెలలుగా నిధులు లేకనీరసించిన గ్రామాలు

ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు

పనిభారంతో చేతులెత్తేసిన పంచాయతీ కార్యదర్శులు

ఎంపీడీఓలకు చెత్త సేకరణట్రాక్టర్ల తాళాలు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement