
త్వరితగతిన సమస్యలు పరిష్కారం
37 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గు రువారం తూప్రాన్లోని రావెళ్లి, మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లిలో రెవెన్యూ సదస్సును సందర్శించారు. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, వాటిని వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 13,693 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు కృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనంతరం శివ్వంపేట ప్రభు త్వ జూనియర్ కాలేజీకి తరగతి గదుల కొరత ఉండడంతో కలెక్టర్ పరిశీలించారు. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం శివ్వంపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతుంది. త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవి, తహసీల్దార్ కమలాద్రి, ఎంఈఓ బుచ్చనాయక్, ప్రిన్సిపాల్ శైలజ, హెచ్ఎం బాలచంద్రం ఉన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్
జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఐటీసీ పరిశ్రమలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించాలని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెట్లను నరికితే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాశ్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఈఓ మల్లేశం, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, ఐటీసీ ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు.