
భూసమస్యలు పరిష్కరిస్తాం
కౌడిపల్లి(నర్సాపూర్): భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని ధర్మాసాగర్లో రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులలో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన రైతులు వాటికి పట్టాలు కావాలని దరఖాస్తులు చేస్తున్నారని చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి