సదస్సులను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

సదస్సులను సద్వినియోగం చేసుకోండి

Jun 11 2025 11:40 AM | Updated on Jun 11 2025 11:55 AM

checking documents

దరఖాస్తులను పరిశీలిస్తున్న నగేష్

అదనపు కలెక్టర్‌ నగేష్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని పాంపల్లి, ధర్మాసాగర్‌లో సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్‌ జహీర్‌, ఆర్‌ఐ శ్రీహరి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

జెడ్పీ సీఈఓ ఎల్లయ్య

పెద్దశంకరంపేట(మెదక్‌): గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. మంగళవారం పెద్దశంకరంపేట మండల పరిషత్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌ అలీ, ఈ జీఎస్‌ ఏపీవో సంతోష్‌ కుమార్‌లను ఆదేశించారు. అన్ని గ్రామాలలో ఉపాధి పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈసీ నవాజుద్దీన్‌ తదితరులు ఉన్నారు.

ఎంపీపీ కార్యాలయం తనిఖీ

అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం మండల పరిషత్‌ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మంగళవారం తనిఖీ చేశారు. ప్రతి పంచాయ తీలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమ య పాలన పాటించాలని సూచించారు. ఆయ న వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

హామీలను నెరవేర్చాలి తపస్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లం

మెదక్‌జోన్‌: కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తపస్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లం డిమాండ్‌ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ బిల్లుల విడుదల, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాకపోవడం బాధాకరమని చెప్పారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా రెండింటిని ప్రకటించి ఒకటి మాత్రమే అమలు చేయడం దారుణమని వాపోయారు. హామీలను నెరవేర్చకుంటే ఆందోళనమే శరణ్యమని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా బాధ్యులు నర్సింలు, శ్రీధర్‌రెడ్డి, సిద్ధూ, నరేందర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలనలో ఎంతో అభివృద్ధి

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌

హత్నూర(సంగారెడ్డి): ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి జరిగిందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. హత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హత్నూర మండలం దౌల్తా బాద్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన అమృతకాలమని ఎన్నో అసాధ్యం కాని నిర్ణయాలు తీసుకుని సుసాఽ ద్యం చేసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మోదీనేన్నారు.

Ellam1
1/2

మాట్లాడుతున్న ఎల్లం

Plantation2
2/2

దౌల్తా బాద్‌లో మొక్కలు నాటుతున్న నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement