
ఆర్టీసీ చార్జీల మోత
మెదక్జోన్: ఆర్టీసీ బస్పాస్ చార్జీల పెంపు విద్యార్థులు, ప్రయాణికులకు శరాఘాతంగా మారింది. అలాగే.. ప్రయాణికులకు టోల్గేట్ చార్జీలు కూడా అదనంగా భారం పడనుంది. పెరిగిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్సు డిపోలలో 140 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థుల బస్పాస్లపై 20 శాతం పెంచగా, టోల్గేడ్ దాటే ప్రతి ప్రయాణికులపై 8 శాతం పెరిగింది. దీంతో ప్రయాణికులపై నెలకు రూ.62.38 లక్షల అదనంగా భారం పడనుంది. టోల్ గేట్ చార్జీ టిక్కెట్కు అదనంగా రూ.10 పెరిగింది. కాగా, రెండు డిపోల పరిధిలో నిత్యం ఆర్టీసీకి రూ.20 లక్షల ఆదాయం వస్తుండగా.. 8శాతం బస్సు చార్జీలు పెరగటంతో ప్రయాణికులపై నిత్యం రూ.1.60 లక్షలు, నెలకు సుమారు రూ.48 లక్షలు అదనంగా భారం పడనుంది.
విద్యార్థుల పాస్లపై 20 శాతం అదనం
ఆర్టీసీ యజమాన్యం ప్రయాణికులతో పాటు విద్యార్థుల బస్సుపాస్లపై ఏకంగా 20 శాతం అదనంగా చార్జీ పెంచేసింది. మొన్నటి వరకు 20 కిలోమీటర్లు ఆర్డీనరి బస్సులో ప్రయాణించే విద్యార్థికి నెలకు రూ.450 చెల్లించగా.. పెరిగిన ధరతో రూ. 540 కానుంది. జిల్లా వ్యాప్తంగా 6,365 మంది బస్సు పాస్లు ఉన్నాయి. వీరి ద్వారా మొన్నటి వరకు నెలకు రూ.71.51 లక్షల ఆదాయం వస్తుండగా.. పెరిగిన 20 శాతం ధరతో నెలకు రూ. 14.30 లక్షలు అదనపు భారం పడుతుంది. దీంతో నెలకు రూ. 85.81 లక్షలు విద్యార్థులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని విద్యార్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల బస్పాస్లపై 20 శాతం..
టోల్గేట్ చార్జీలు 8 శాతం అదనం
నెలకు రూ. 62.38 లక్షల భారం
మండిపడుతున్న
ప్రయాణికులు, విద్యార్థి సంఘాలు
చదువుకు దూరం చేయటమే..
విద్యార్థుల బస్సుపాస్లపై ఏకంగా 20 శాతం చార్జీలు పెంచటం అంటే మారు మూల గ్రామాలకు చెందిన పేద విద్యార్థులను చదువులకు దూరం చేయటమే అవుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య, వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలి. పాస్లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదు.
శ్రీనివాస్గౌడ్, ఏబీవీపీ
మెదక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్

ఆర్టీసీ చార్జీల మోత