
భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు
పాపన్నపేట(మెదక్): భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాష్త్రవేత్తలు మహేంద్రకుమార్, అంబికా సోని సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లాపూర్లో జరిగిన వికసిత సంకల్ప అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి పంటకు ముందు మట్టి పరీక్షలు నిర్వహించడం ద్వారా ,భూమికి అవసరమైన పోషకాలను గుర్తించవచ్చన్నారు. ఇందుకనుగుణంగా ఏయే ఎరువులు వాడాలో తెలుస్తుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకే ఎరువులు వాడాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే.. దిగుబడి తగ్గడమే గాకుండా, పెట్టుబడి వ్యయం తడిసి మోపెడువుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు ప్రసాద్, సాయిప్రసాద్, చిన్నబాబు, రవికుమార్, ఆత్మడిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ అంబికా సోని, ఏడిఏ విజయ నిర్మల, ఏఓ నాగమాధురి, ఏఇఓలు అభిలాష్, జనార్ధన్, రజిత పాల్గొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు మహేంద్రకుమార్
అధిక దిగుబడులు సాధించాలి
నర్సాపూర్: వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిగ దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి వినయ్కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోయా చిక్కుడు సాగుపై శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, వానాకాలానికి అనువైన కూరగాయల విత్తనాలపై ఉద్యానవన కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ శ్రీనివాస్, పశువుల వ్యాధులు, వాటి నివారణపై పశువైద్యురాలు లక్ష్మి సూచనలు ఇచ్చారన్నారు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మంచి లాభాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.