
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
మెదక్ కలెక్టరేట్: సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును మంగళవారం పాత్రికేయులు నిరసించారు.ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. ఈ దాడిని మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.