
దరఖాస్తుల ఆహ్వానం
జీలుగ సాగుతో లాభాలెన్నో.. జీలుగ విత్తనాలు వేసుకుంటే పొలంలో సేంద్రియ ఎరువును తయారు చేసుకునే అవకాశం ఉంది. వివరాలు 9లో u
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో బోధనకు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల కో–ఆర్డినేటర్ సువర్ణలత తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామయంపేట, కొల్చారంలోని పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు, హిందీ, ఆంగ్లం, పీఈటీ, పీడీ, పౌర, కామర్స్, భౌతిక, రసాయన, జువాలజీ, జీవశాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ, ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పార్ట్టైం ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 29వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులను మెరిట్, డెమో ప్రాతిపదికన ఎంపిక చేస్తామని, ఈనెల 31న ఉదయం 10 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు.