మొక్కల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

May 27 2025 7:34 AM | Updated on May 27 2025 7:34 AM

మొక్క

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

పెద్దశంకరంపేట(మెదక్‌): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ మేనేజర్‌ శ్రావణ్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొట్టిముక్కుల, మ ల్కాపూర్‌ తదితర గ్రామాల్లో నర్సరీలు, హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మాల వారీగా అవసరమైన మొక్కలను పెంచడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టాలన్నారు. రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈజీఎస్‌ ఈసీ నవాజుద్దీన్‌, ఎఫ్‌ఏలు నర్సింలు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

తాగు నీటి వసతి కల్పిస్తాం

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని కూకుట్లపల్లిలో నూతనంగా నిర్మించిన పాఠశాల వద్ద తాగు నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీఓ సాయిబాబ తెలిపారు. సోమవారం పాఠశాల వద్ద పైపులైన్‌ ను పరిశీలించి మిషన్‌ భగీరథ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. భగీరథ ద్వారా నల్లా కనెక్షన్‌ ఇప్పించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. వర్షాకాలంలో మురికి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ కలీముల్ల, హెచ్‌ఎం రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరికలు

నర్సాపూర్‌: మండలంలోని పెద్దచింతకుంట, చిన్నచింతకుంట గ్రామాలకు చెందిన పలు వురు సోమవారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిన్న ఆంజిగౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌ గుప్తా, హర్షవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో సర్టిఫికెట్లు

అందించాలి

మెదక్‌ కలెక్టరేట్‌: తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సకాలంలో కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఎస్సీ మన్నె కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం సంఘం నాయకులతో కలిసి అదనపు కలెక్టర్‌ నగేష్‌ను వినతిపత్రం అందజేశారు.

రసీదులు తప్పనిసరిగా

తీసుకోవాలి

నర్సాపూర్‌: ప్రభుత్వ లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్దే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని ఏడీఏ సంధ్యారాణి సూచించారు. సోమవారం ఆమె నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌లో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా అన్ని వివరాలతో కూడిన రసీదులు తీసుకోవాలన్నారు. రసీదులు ఇవ్వని పక్షంలో తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి దీపిక, ఏఈఓ చంద్రవేణి ఉన్నారు.

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత 
1
1/3

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత 
2
2/3

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత 
3
3/3

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement