
కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి
వెల్దుర్తి(తూప్రాన్): ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో పలు గ్రామాలకు చెందిన వారికి సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ వర్గాలకు కాంగ్రెస్తోనే న్యా యం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ద్వారా స్పష్టం అయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లు ఒక్కటే అనడానికి ఆమె చేసిన ఆరోపణలు బలాన్ని ఇస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ రూపంలో రూ. వేల కోట్లు కాజేసిన హరీశ్రావు, ఫార్ములా వన్ రేస్, ఐటీ పేరుతో ఓఆర్ఆర్ చుట్టూ భూములు కాజేసిన కేటీఆర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డగోలుగా ప్రభుత్వ భూములు అప్పజెప్పి రూ. కోట్లు గడించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్రావులో దయ్యం ఎవరో బహిర్గతం చేయాల్సిన అవసరం కేసీఆర్పై ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేహేహశ్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, సుధాకర్గౌడ్, నర్సింహారెడ్డి, మల్లేశం, శంకరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి