అందుబాటులో కేఎన్‌ఎం 1638 వరి విత్తనం | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో కేఎన్‌ఎం 1638 వరి విత్తనం

May 26 2025 7:31 AM | Updated on May 26 2025 7:31 AM

అందుబ

అందుబాటులో కేఎన్‌ఎం 1638 వరి విత్తనం

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి వద్ద గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేఎన్‌ఎం 1638 సన్నరకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కేవీకే హెడ్‌ అండ్‌ సైంటిస్ట్‌ శంభాజీ దత్తాత్రేయ నల్కర్‌, శాస్త్రవేత్తలు రవికుమార్‌, డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. 20 కిలోల బస్తా రూ. 1,060 లభిస్తుందన్నారు. ఎన్‌ఎం 1638 సన్నరకం వరి విత్తనాల పంటకాలం 135 రోజులు కాగా, అగ్గితెగులు, ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్పారు. ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందన్నారు. వానాకాలం, యాసంగి రెండు పంటలకు అనుకూలమని వివరించారు. జూన్‌ 2 నుంచి రైతులకు విత్తనాలను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.

‘భూభారతి’పై

అవగాహన అవసరం

పాపన్నపేట(మెదక్‌): గ్రామీణ రైతాంగం భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్‌ సూచించారు. ఆదివారం మండల పరిధిలోని పొడిచన్‌పల్లి తండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 1168, కొత్తపల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 342లో కొంతమంది రైతులు పాత పాస్‌ పుస్తకాలు కలిగి ఉండి, భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ రైతు భరోసా, బీమా వంటి పథకాలు అందడం లేదని చెప్పారు. ఈ సమస్యలను ప్రో బోనోగా స్వీకరించి న్యాయపరంగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు నల్లపు మణిదీప్‌, చంద్రకుమార్‌, గణే ష్‌, పలువురు రైతులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా గ్రామ పాలన

అధికారి పరీక్ష

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఆర్‌ఓ భుజంగరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షకు 104 మంది దరఖాస్తు చేసుకోగా, 79 మంది హాజరైనట్లు చెప్పారు. మరో 25 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమాదేవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు, పోలీస్‌ అధికారులు ఉన్నారు.

‘వారిపై చర్యలు తీసుకోండి’

కొమురవెల్లి(సిద్దిపేట): దళితబంధు పేరుతో గత ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం లెనిన్‌నగర్‌లో దళితబంధు పథకం కోసం బీఆర్‌ఎస్‌ నాయకుడికి డబ్బులు ఇచ్చి మోసపోయిన దాసరి హరిబాబును పరామర్శించారు.

అందుబాటులో కేఎన్‌ఎం  1638 వరి విత్తనం 
1
1/1

అందుబాటులో కేఎన్‌ఎం 1638 వరి విత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement