
మిగిలిన సీట్ల భర్తీకి 27న కౌన్సెలింగ్
నర్సాపూర్: నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల కాలేజీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ శ్రీనివాస్రాయ్ తెలిపారు. మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తామని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకొని రావాలన్నారు. ఇతర వివరాలకు 8790724953, 8639898246 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
గోహత్యలను అరికట్టండి
మెదక్జోన్: గోవుల అక్రమ రవాణాను అరికట్టి గోహత్యలు జరగకుండా చూడాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ అన్నారు. ఈ మేరకు శనివారం పలువురు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్, మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా చుట్టూ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నేతలు బబ్బులు, సాయి, రాహుల్, ప్రశాంత్, పండరి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్యల
బలోపేతానికి చర్యలు
రామాయంపేట(మెదక్): మహిళా సమాఖ్యల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీపీఎం జాన్ కెన్నడీ అన్నారు. శనివారం రామాయంపేటలోని ఐకేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచి ంచారు. అనంతరం మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా రేణుక, కార్యదర్శిగా హారిక, కోశాధికారిగా రచన ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏపీఎం రాములు, సీసీలు వెంకట్రాములు, అమృత, చెన్నమ్మ, అకౌంటెంట్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
కేవీకేలో ఫార్మర్ హాస్టల్
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి కేవీకేలో రూ. 84 లక్షలతో నిర్మిస్తున్న ఫార్మర్ హాస్టల్ పనులను శనివారం ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) చైర్మన్ డాక్టర్ పీవీరావు పరిశీలించారు. ఎక్సాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. కార్యక్రమంలో కేవీకే కోషాధికారి రాఘవరావు, కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, ఉదయ్కుమార్, సైట్ ఇంజనీర్ జానకీరాం తదితరులు పాల్గొన్నారు.
అన్నదాత ‘వరి’ గోస
హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనాలని మాచవరం గ్రామానికి చెందిన అన్నదాతలు రోడ్డెక్కారు. శనివారం మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధాన్యం కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పకడ్బందీగా నిర్వహించాలి
మెదక్జోన్: గ్రామపాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఇదే విష యమై శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, కలెక్టరేట్ ఏఓ యూనస్, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, డీఆర్వో భుజంగరావు తదితరులుపాల్గొన్నారు.

మిగిలిన సీట్ల భర్తీకి 27న కౌన్సెలింగ్

మిగిలిన సీట్ల భర్తీకి 27న కౌన్సెలింగ్