
ప్రతి గింజకూ మద్దతు ధర
కొండపాక(గజ్వేల్): ప్రతి గింజకూ మద్దతు ధర అందించేలా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పార పట్టాక పాసింగ్ చేయాలన్నారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్రావు, నాయకులు వెంకటేశంగౌడ్, సుదర్శన్, పర్శరాములు, ప్రభాస్, నరేందర్ రావు, నర్సింగరావు, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి