
తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేస్తూనే పట్టణంలోని అన్ని బోర్లకు మోటార్లు బిగించి, నీటి సరఫరా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ సరిగా చేపట్టకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాగా పట్టణంలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాయరావు చెరువు పంట కాల్వ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
నిరంతర వైద్య సేవలు
అందించాలి: డీఎంహెచ్ఓ
పాపన్నపేట(మెదక్): రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం పాపన్నపేట పీహెచ్సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. జాతీయ కార్యక్రమాలు ఎయిడ్స్, పైలేరియా, కుష్టు, మలేరియా తదితర రోగాల నివారణకు వైద్య సిబ్బంది నిరంతర కృషి చేయాలని చెప్పారు. ఆయన వెంట డాక్టర్ హరిప్రసాద్, అన్వర్, సీహెచ్ఓ చందర్, శ్రీనివాస్రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో శనివారం ఆయా ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్బాబు, పట్టణ ఏఈ నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
కార్యకర్తలే పార్టీకి
పట్టుగొమ్మలు
నర్సాపూర్ రూరల్: రాజకీయ పార్టీలకు కార్యకర్తలే పట్టుగొమ్మలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రమేష్గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దచింతకుంటలో మండల పార్టీ అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ క్రియాశీల సభ్యత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజేష్, బూత్ అధ్యక్షులు సాయినాథ్, నాగరాజ్ పాల్గొన్నారు.
నైపుణ్యం ఉంటే
ఏదైనా సాధించవచ్చు
నర్సాపూర్ రూరల్: పట్టుదలతో పాటు నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. ప్రకాష్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నర్సా పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాలేదని నిరాశ చెందవద్దన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, వైస్ ప్రిన్సిపాల్ సమీరా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సురేష్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి