
కాంగ్రెస్తోనే సంక్షేమం
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్తోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాళ్లకల్, లింగారెడ్డిపేట, కూచారం గ్రామాల్లో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెంటాగౌడ్, వీరబోయిన గోపాల్, సత్యనారాయణ, ర్యా కల కృష్ణాగౌడ్, లక్ష్మీనర్సింలుగౌడ్, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోనాపూర్ పీఏసీఎస్లో నిధుల దుర్వినియోగం!
రామాయంపేట(మెదక్): మండలంలోని కోనాపూర్ సహకార సంఘంలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. సుమారు రూ. 2 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు గ్రామస్తులు గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఫైల్ ముందుకు కదిలింది. సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారణ అధికారిగా సహకారశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈమేరకు ఆయన పలు దఫాలుగా విచారణ నిర్వహించారు. గ్రామంలో సంఘం డైరెక్టర్లు, మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇదే విషయమై జిల్లా సహకార అధికారి కరుణాకర్ను సంప్రదించగా, తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. విచారణ అధికారిగా నియమితులైన సంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు.
నియామక ఉత్తర్వులు
పాపన్నపేట(మెదక్): మండలంలోని కొడుపాకకు చెందిన పంతుల సంతోష్ ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన ఇటీవల వెలువడిన ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించారు. సంతోష్ సోదరుడు టీచర్గా పనిచేస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి డీఏఓగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
దుర్గమ్మా.. దండాలమ్మా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అమ్మవారిని పూజారులు పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

కాంగ్రెస్తోనే సంక్షేమం

కాంగ్రెస్తోనే సంక్షేమం