మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. అయితే ప్రజావాణికి అధికంగా భూ సమస్యలపై 19, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1, పెన్షన్ల కోసం 1, ఉద్యోగ ఉపాధిపై 2, ఇతర సమస్యలపై 33 అర్జీలు కలిపి మొత్తం 56 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్