హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్శాఖ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లి సబ్స్టేషన్లో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్, నాగాపూర్ సబ్స్టేషన్ సుల్తాన్పూర్ ఫీడర్కు సంబంధించి 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా నూతన ట్రాన్స్ఫార్మర్లు బిగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీఈ మోహన్బాబు, ఏఈ వినోద్కుమార్ పాల్గొన్నారు.