అదనపు కలెక్టర్
నగేష్
మెదక్ కలెక్టరేట్: రంజాన్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్లో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. తాగునీరు అవసరమైన చోట అదనంగా నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేయాలన్నారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అలాగే దుకాణాల వద్ద ఆహార భద్రత నిబంధనలు తప్పకుండా అనుసరించాలన్నారు. వివిధ పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. మతపెద్దలు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయ నున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎల్ఆర్ఎస్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఆర్ఓ భుజంగరావు, డీపీఓ యాదయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.