వర్గల్(గజ్వేల్): వివిధ నామినేటెడ్ పదవులను రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారం ఎస్సీవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సీఎం రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రతిఒక్కరూ పార్టీకి విధేయులై పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.