 
															మానసిక ఆరోగ్యస్థితిపై సర్వే
కోటపల్లి: మండలంలోని ఎసన్వాయి గ్రా మంలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 ప్రా జెక్టును మంగళవారం ప్రారంభించారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మానసిక ఒత్తిడి, వృద్ధాప్య స మస్యలు, మద్యపానం, మహిళల ఆరోగ్యం, పిల్లల పోషణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్లు డాక్టర్ వామన్ కుల్కర్జి, డాక్టర్ సాయికృష్ణ, తెలంగా ణ రాష్ట్ర కో ఆర్డినేటర్ వినిల్, డాక్టర్ అరుణ శ్రీ, కార్యదర్శి అబ్ధుల్ తాజుద్దీన్, ఏఎన్ఎం తి రుపతి, అశా కార్యకర్త స్వరూప పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
