గృహహింస చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

గృహహింస చట్టాలపై అవగాహన ఉండాలి

Jul 17 2025 3:24 AM | Updated on Jul 17 2025 3:24 AM

గృహహింస చట్టాలపై అవగాహన ఉండాలి

గృహహింస చట్టాలపై అవగాహన ఉండాలి

లక్సెట్టిపేట: మహిళలు గృహహింస చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి కే.సాయికిరణ్‌ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల అంగన్‌వాడీ మహిళా సిబ్బందికి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయని, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇబ్బందులు పడితే అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్తన్న, కార్యదర్శి ప్రదీప్‌, ఏజీపీ సత్యం, న్యాయవాదులు సురేందర్‌, శ్రీధర్‌, పద్మ, సత్యనారాయణ, ఎంపీడీవో సరోజ, సీడీపీవో రేష్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement