ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో చోరీ

Jul 11 2025 12:40 PM | Updated on Jul 11 2025 12:40 PM

ఎలక్ట

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో చోరీ

నిర్మల్‌టౌన్‌: జిల్లాకేంద్రంలోని మోహన్‌ ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్‌ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం రూరల్‌ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్‌ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్‌ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్‌ శ్రీకాంత్‌, జిందాడే సచిన్‌, సాబ్లే జగదీశ్వర్‌, కూసులే నవీన్‌ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ ఇమ్రాన్‌ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్‌, గీజర్‌, సామ్‌సంగ్‌ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్‌ ఉన్నారు.

కరీంనగర్‌ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్‌

కరీంనగర్‌క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్‌చల్‌ చేసిన అఘోరి శ్రీనివాస్‌ గురువారం కరీంనగర్‌ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్‌పల్లికు చెందిన శ్రీనివాస్‌తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్‌ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్‌ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్‌ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్‌పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను పీటీ వారెంట్‌ ద్వారా కరీంనగర్‌ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్‌కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్‌ విధించింది. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

లోన్లు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: లోన్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తాపూర్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీకి చెందిన రమేశ్‌ రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని ప్రజల వద్ద రూ.25 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో చోరీ
1
1/1

ఎలక్ట్రానిక్స్‌ గోదాంలో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement