పార్టీ పటిష్టతకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

Jul 10 2025 6:53 AM | Updated on Jul 10 2025 6:53 AM

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉమ్మడి జిల్లా నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. పార్టీని బలంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌, నాయకులు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement