
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే ● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ● నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం
దండేపల్లి/ జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో రా ష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచి ర్యాల జిల్లా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పు ష్కల అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా రు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శ క్తి సౌర విద్యుత్ ప్రాజెక్టు, హాజీపూర్ మండలం వేంపల్లిలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రీయల్, ఐటీ, ఆటోనగర్ పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు. నలుగురు మంత్రుల రాకతో జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది.
ప్రజల మద్దతుతో ముందుకు..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడు తూ, నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని, వారి శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేస్తానని అన్నారు. ఇంద్రవెల్లి, నస్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దండెపల్లి మండలంలో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రెండు విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే.శశాంక్, అటవీ శాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతా రాం, జిల్లా అటవీ శాఖా అధికారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భాస్కర్, ఏసీసీ ప్రకా శ్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మధిరతో సమానం..
మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెబ్బెనపల్లిలో ఇందిర మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యేప్రేమ్సాగర్రావు కోనట్లుగా దండెపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశలవారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థులతో కలిసి భోజనం..
లక్సెట్టిపేట: పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభుత్వ కళాశాల భవనాల ప్రారంభోత్స వం తర్వాత మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సహపంక్తి భోజ నం చేశారు. పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులలోని బెంచీలపై కూర్చుని చిన్నానాటి జ్ఞాపకాల ను గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి విద్యార్థి వద్ద పుస్తకాన్ని తీసుకుని చదివారు. కళాశాల గదులన్ని తిరిగి చూశారు. విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ల విడుదల కోసం వినతిపత్రం అందజేశారు.

అభివృద్ధిలో అగ్రగామి..