
ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కిట్లు
పాతమంచిర్యాల: గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కిట్ల ద్వారా 80శాతం ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కిట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాటమయ్య రక్షణ కిట్లు వాడడం వల్ల గీత కార్మికులకు ప్రమాదాలు తగ్గాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 19మందికి కిట్లు పంపిణీ చేశారు. జిల్లా అటవీ అధికారి శివ్ఆశీష్సింగ్, ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, ఎక్సైజ్శాఖ సీఐ సమ్మయ్య పాల్గొన్నారు.
అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
జిల్లాలోని అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్సింగ్, డీసీపీ భాస్కర్ అటవీ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణల నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అటవీ చట్టాలు ఉల్లంఘించి ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ భూముల ఆక్రమణల నిరోధానికి పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లాలో టాస్క్ఫో ర్సు టీం ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, అటవీరేంజ్ అధికారులు పాల్గొన్నారు.