
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
లక్సెట్టిపేట/మంచిర్యాలరూరల్(హాజీపూర్): వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్ అన్నారు. శుక్రవారం లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధిలోని ఇటిక్యాలలో వార్డులను పరిశీలించారు. హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇటిక్యాలలో చాలామంది డెంగీ బారినపడ్డారని, డెంగీ రహితంగా ప్రకటించేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రో గ్రాం అధికారి ప్రసాద్, వైద్యులు సతీష్కుమార్, లింగారెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లహరి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, ఎన్సీడీ అధికారి డాక్టర్ శివప్రతాప్, డీఈఎంఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.