
బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారం అహీర్కు నాయకులతో కలిసి బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ సబ్ప్లాన్ను రూ.2 లక్షల కోట్లతో ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు తులా మధుసూదన్, కర్రె లచ్చన్న, గజెల్లి వెంకటయ్య, భీంసేన్, గాజుల ప్రభాకర్, ఎస్.కిష్టయ్య, అంకం సతీష్ పాల్గొన్నారు.