
భూగర్భ జలాల పనుల పరిశీలన
చెన్నూర్రూరల్: మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన 46 వివిధ రకాల అభివృద్ధి పనులను శుక్రవారం కేంద్ర భూగర్భ నీటి బోర్డు శాస్త్రవేత్త రాంబాబు పరిశీలించారు. నీటికుంటల ప్రగతిని క్షేత్ర స్థాయిలో సమీక్షించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఫారెస్టు ట్రెంచ్, చిన్న నీటికుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ రీచార్జ్ స్ట్రక్చర్ను పరిశీలించారు. ఎంపీడీవో మోహన్, నోడల్ అధికారి సదానందం, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సత్యనారాయణ, చంద్రశేఖర్, డీఆర్పీ రాజ్కుమార్, ప్లాంటేషన్ అధికారి శ్రీని వాస్, కుమారస్వామి, మధు, టీఏలు మహేశ్వర్రెడ్డి, రవీందర్, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు.