చెన్నూర్: మున్సిపాల్టీ పరిధిలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో వర్షాకాలం సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి. ప్రధాన రోడ్లలో వ్యాపార సముదాయాలు, డ్రెయినేజీలపై స్లాబ్లు వేయడంతో మురికి కాలువలు శుభ్రం చేయడం కష్టమవుతోంది. ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో డ్రెయినేజీల నీరు రోడ్లపై పారుతోంది. పాతబస్టాండ్ నుంచి మార్కెట్కు వెళ్లే దారిలో డ్రెయినేజీల్లోని నీరు వర్షాకాలంలో మేరవాడలోని ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్టాండ్ నుంచి ఖబ్రస్తాన్ పక్కన ఉన్న డ్రెయినేజీలు శుభ్రం చేయించాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని బలిజవాడ, జెండవాడ, ఇందిరానగర్, బేతాళవాడ, ఆదర్శనగర్, లైన్గడ్డ ప్రాంతాల్లో మురికికాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. పలు కాలనీల్లో రోడ్లపై వేసిన చెత్త తొలగించకపోవడంతో కుళ్లిపోతోంది. చెత్తకుప్పలు, మురికికాలువలతో ఈగలు, దోమలు వృద్ధి చెందాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దోమలు, ఈగల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాలువల్లో గడ్డి
డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. కాలువలు శుభ్రం చేయకపోవడంతో గడ్డి మొలుస్తుంది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగాయి. కొన్ని డ్రెయినేజీలు సక్రమంగా లేక వర్షపు నీరు రోడ్లపై పారుతోంది. జ్వరాలు సోకక ముందే అధికారులు మురికి కాలువలు శుభ్రం చేయించాలి.
–మానికరౌతు తిరుపతమ్మ, బలిజవాడ
కాలనీ కంపు కొడుతోంది..
ఇందిరానగర్ కాలనీలో డ్రెయినేజీలు లేక మురుగునీరు ఖాళీ స్థలాల్లో చేరి కంపు కొడుతోంది. డ్రెయినేజీలు నిర్మించి మురుగు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడే నీరు నిలిచి దుర్వాసన వస్తుంది. వర్షాకాలంలో మురికినీరుతోపాటు వర్షపు నీరు నిలిస్తే భరించలేకుండా ఉంటుంది. అధికారులు స్పందించి ఖాళీ స్థలంలో నిలిచిన నీరును డ్రెయినేజీలకు మళ్లించే ఏర్పాటు చేయాలి.
–సీహెచ్.నవీన్, ఇందిరానగర్ కాలనీ
విపరీతంగా ఈగలు, దోమలు
విపరీతంగా ఈగలు, దోమలు
విపరీతంగా ఈగలు, దోమలు