
పాలిసెట్ కౌన్సెలింగ్కు 295 మంది హాజరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో శుక్రవారం పాలిసెట్–25లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండోరోజు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. మొత్తం 295 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి సర్టిఫికెట్లను సంబంధిత అధికా రులు పరిశీలించి ధృవీకరించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, కౌన్సెలింగ్ ఇన్చార్జి టీ మధుకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
లక్సెట్టిపేట: మున్సిపల్ కమిషనర్గా సంపత్కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన మారుతీప్రసాద్ సీడీఎంఏకు బదిలీ కాగా, హైదరాబాద్లోని సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తున్న సంపత్కుమార్ బది లీపై ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అతడికి కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
ఇచ్చోడ: నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. నకి లీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిపై ఈనెల 16న కేసు నమోదు చేయగా, పరారీలో ఉన్న వ్యక్తిని శుక్రవారం పట్టుకుని రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. జిల్లాలో నకిలీ విత్తనా లను అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు ప్ర త్యేక టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనె ల 16న ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామంలో తనిఖీలు నిర్వహించగా నరవాటే ఈశ్వర్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద 20 బ్యాగ్ల పింక్ బాండ్ 5జీ నకిలీ విత్తనాలు ల భించగా, విచారణలో తాను ఆదిలాబాద్కు చెందిన పిప్పల్వార్ సునీల్ వద్ద తీసుకున్నట్లు చెప్పాడని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, పరారీలో ఉన్న పిప్పల్వార్ సునీల్ను ఆదిలాబాద్ జిల్లా సాంకేతిక నిపుణులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.గోపీకృష్ణ సూచన మేరకు ఇచ్చోడ ఎస్సై పురుషోత్తం హైదరాబాద్కు పోలీస్ బృందాన్ని పంపి అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.