21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు | - | Sakshi
Sakshi News home page

21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు

Apr 20 2025 1:56 AM | Updated on Apr 20 2025 1:56 AM

21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు

21 నుంచి సమ్మెలోకి ఆర్జీయూకేటీ అధ్యాపకులు

బాసర: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తర్వాతే నోటిపికేషన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్జీయూకేటీ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. శనివారం సమ్మె నోటీస్‌ను ఏవో రణధీర్‌కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ స్థాపించినప్పటి నుంచి దాదాపుగా 17 ఏళ్లుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు డాక్టర్‌ ఎన్‌. విజయ్‌ కుమార్‌, మంద సతీశ్‌ కుమార్‌, శ్రీధర్‌, తిలక్రెడ్డి, డాక్టర్‌ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement