గెలుపోటములను సమానంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

Sep 15 2025 8:31 AM | Updated on Sep 15 2025 8:31 AM

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: క్రీడల్లో గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా తీసుకోవాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు శాంతికుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆయన మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. కోచ్‌లు చెప్పే సలహాలు, సూచనలను పాటించాలన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. ఎంపిక కానివారు బాధపడవద్దని, భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఎంపికల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌, దామోదర్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, రాములు, ముత్యం, రాంచంద్రయ్య, శ్రీహరి, ఉమామహేశ్వర్‌రెడ్డి, తిరుపతయ్య, నర్సింలు, బాల్‌రాజు, శ్రీనివాసులు, గణేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement