
స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వేలంలో ధరలు సల్పంగా పెరిగాయి. సీజన్ తగ్గడంతో ధరలు పెరగడం ప్రారంభమైంది. గతవారంతో పోల్చితే గరిష్ట కనిష్ట ధరలు రూ.500 వరకు పెరిగాయి. వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్కు తక్కువ మొత్తంలో ఉల్లి అమ్మకానికి వచ్చింది. మార్కెట్లో ఉదయం పది గంటలకు ఉల్లి వేలం ప్రారంభం కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు ఉల్లిని కొనడానికి పోటీ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్కు వచ్చిన ఉల్లి నిల్వ చేసుకునే అవకాశం ఉండడంతో వినియోగదారులు మార్కెట్కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలా మంది రైతులు వేలం వేయకుండానే నేరుగా వినియోగదారులకు బస్తాలుగా చేసి అమ్ముకున్నారు. మార్కెట్ బయట కూడా రైతులు ఉల్లి విక్రయాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లో, మార్కెట్ బయట సందడిగా కనిపించింది.
బస్తా ధర రూ.1050
దేవరకద్ర మార్కెట్లో జరిగిన ఉల్లి బహిరంగ వేలంలో గరిష్టంగా రూ. 2100, కనిష్టంగా రూ. 1700 గా ధరలు వచ్చాయి. 50 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ. 1050, కనిష్టంగా రూ. 800లకు విక్రయించారు. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది.
గరిష్టంగా రూ. 2100
కనిష్టంగా రూ. 1700