
సత్తా చాటిన మైనార్టీ గురుకులాలు
స్టేషన్ మహబూబ్నగర్: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మహబూబ్నగర్ జిల్లాలోని 10, నారాయణపేటలోని రెండు గురుకులాలు 96.87 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ రెండు జిల్లాలోని 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 671 మంది విద్యార్థులకు 650 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని బాలికల–1, నారాయణపేట జిల్లాలోని మక్తల్ బాలికల–1, నారాయణపేట బాలుర–1 గురుకుల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత పొందాయి. మైనార్టీ గురుకులాల్లో మెరుగైన ఫలితాలు రావడంపై ఆర్ఎల్సీ ఖాజా బాహుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు.
గురుకుల పాఠశాలల వారీగా
ఉత్తీర్ణత వివరాలు
గురుకులం ఉత్తీర్ణత
శాతం
మహబూబ్నగగర్ బాలుర–1 92.11
బాలుర–2 92.59
బాలుర–3 98.4
బాలికల–1 96.8
బాలికల–2 96.6
బాలికల–3 95.16
జడ్చర్ల బాలికల–1 100
బాలుర–1 97.14
దేవరకద్ర బాలుర–1 97.83
బాలుర–2 96.77
నారాయణపేట బాలుర–1 100
మక్తల్ బాలికల–1 100
ప్రణాళికాబద్ధంగా చదివాను..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో 96.87 శాతం ఉత్తీర్ణత
మూడు గురుకులాల్లో 100 శాతం
ఫలితాలు