ఈ ఏడాది పదో విడత హరితహారం కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నాం. ఇప్పటికే నర్సరీల్లో అవసరమైన మొక్కలు పెంచాం. ఎండ వేడికి మొక్కలు చనిపోకుండా షేడ్నెట్లు సైతం ఏర్పాటు చేశాం. డీఆర్డీఓ ఆధ్వర్యంలో జిల్లాకు 17,78,000 మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మొక్కలను మా శాఖ ఆధ్వర్యంలోనే నాటనున్నాం. ఇందుకోసం ఇప్పటికే మా యంత్రాంగంతోపాటు మహిళా సంఘాలను సమాయత్తం చేశాం. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– నర్సింహులు, డీఆర్డీఓ