
చెత్త ఎత్తారు..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తరలించారు. మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల చెత్తపేరుకుపోవడంతో, ఆ దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తీరుపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘చెత్త శుద్ధి ఏది?’ అనే శీర్షీక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి ఆదేశాలతో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారన్ని సిబ్బంది ఎత్తి, ట్రాక్టర్లలో తరలించారు. మొత్తంగా టన్నున్నర చెత్తను సేకరించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

చెత్త ఎత్తారు..