
పింగిళి డిగ్రీ కాలేజీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల (అటానమస్) డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీబీఏ, బీసీఏ కోర్సుల రెండు, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి విడుదల చేశారు. రెండో సెమిస్టర్లో 497మంది విద్యార్థినులకు 251మంది (50.50శాతం), నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో 441మందికి 289మంది (65.53శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆరవ సెమిస్టర్లో 419మందికిగాను 397మంది (94.75శాతం) విద్యార్థినులు పాసయ్యారు. ఫలితాలను కళాశాల వెబ్సైట్లో చూసుకోవచ్చునని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల నియంత్రణాఽఽధికారి డాక్టర్ సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు కొలిపాక శ్రీనివాస్, రాజిరెడ్డి, ఏక్యూఏసీ కోఆర్డినేటర్ సురేష్బాబు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు.