
రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆవరణలోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు మంగళవారం ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండను క్రీడాహబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్ను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ అండర్–10,12,14,16 బాలబాలికల విభాగాల్లో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఎంపిక పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 300 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి పరిశీలకులుగా డాక్టర్ రవికుమార్, నర్సింగరావు, స్వర్ణలత, సంతోశ్, రెజ్లింగ్, హ్యాండ్బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కరీం, పవన్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, శ్రీమన్నారాయణ, రాజు, విష్ణువర్ధన్, వెంకటేశ్వర్లు, నవీన్కుమార్, రమేశ్, అఫ్జల్, జీవన్గౌడ్, శంకర్, దేవిక తదితరులు పాల్గొన్నారు.