మాతా, శిశు మరణాలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

మాతా, శిశు మరణాలు తగ్గించాలి

Jun 11 2025 11:34 AM | Updated on Jun 11 2025 11:34 AM

మాతా, శిశు మరణాలు తగ్గించాలి

మాతా, శిశు మరణాలు తగ్గించాలి

మహబూబాబాద్‌: జిల్లాలో మాతా,శిశు మరణాల ను తగ్గించాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మాతాశిశు మరణాల నివారణపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ల వారీగా గర్భిణుల వివరాలు సేకరించాలన్నారు. హైరిస్క్‌ కేసులు ఉంటే ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌, అధికారులు ఉన్నారు.

అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన..

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతుందని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం డీఈఓ రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో పాఠశాలల పునఃప్రారంభం చేయాలన్నారు.

పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు పూర్తిచేసి పునఃప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆరోగ్యం, విద్య, న్యూట్రిషన్‌, శానిటేషన్‌పై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement