
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
జిల్లాలోని మొత్తం సాగు భూమి:
4.50లక్షల ఎకరాలు
ఎర్ర నేలలు : 2.34లక్షల ఎకరాలు(52శాతం)
నల్లరేగడి నేలలు : 2.16లక్షల ఎకరాలు(48శాతం)
జిల్లాలోని నేలల్లో పోషకాల
వివరాలు (హెక్టార్కు కిలోలు )
పోషకాలు ఉండాల్సినమోతాదు ప్రస్తుత పరిస్థితి
నత్రజని 200 నుంచి 250 కేజీలు 120 కేజీలు
భాస్వరం 30 నుంచి 35 కేజీలు 300 కేజీలు
పొటాష్ 200 నుంచి 270 కేజీలు 180 కేజీలు
సాక్షి, మహబూబాబాద్: వడ్రంగికి కలప స్వభావం తెలియాలి. ఉపాధ్యాయుడికి విద్యార్థి స్వభావం, డాక్టర్కు రోగి స్వభావం తెలియాలి. అప్పుడే వారివారి వృత్తుల్లో రాణిస్తారు. అలాగే రైతుకు నేల స్వభావం తెలియాలి. లేకపోతే ఏ పంట వేసినా నష్టపోతాడు. జిల్లాలో విచ్చలవిడిగా ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం, పంట మార్పిడి చేయకపోవడం మొదలైన కారణాలతో భూమిలో ఉండే ఖనిజ లవణాల సమతుల్యత దెబ్బతిని భూములు సారం కోల్పోతున్నాయి. కాగా, సాగు పద్ధతుల్లో మార్పు, పంట మార్పిడి, భూసార పరీక్షల ద్వారా అనువైన పంటలు సాగు చేస్తేనే ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
దెబ్బతిన్న నేలల సమతుల్యత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి వసతులు పెరిగాయి. దీంతో జిల్లాలో అప్పటి వరకు 3లక్షల మేరకు ఉన్న సాగు భూమి విస్తీర్ణం 4.50లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో 2.34లక్షల ఎకరాలు(52శాతం) ఎర్ర నేలలు(ఎర్రచెక్క, దుబ్బ, చౌడు, ఇసుక), 2.16లక్షల ఎకరాలు(48శాతం) నల్లరేగడి నేలలు(నల్లరేగడి, బంక, జిగురు) ఉంటాయి. అయితే వ్యవసాయశాస్త్ర వేత్తలు చెప్పిన వివరాల ప్రకారం పోషకాలు ప్రతీ 2.5ఎకరాలు(హెక్టారు) నేలలో 20 సెంటీమీటర్ల లోతు వరకు నాలుగైదు చోట్ల మట్టిని తీసి పోషకాలను లెక్కిస్తారు. దీని ప్రకారం నత్రజని 200నుంచి 250 కేజీల వరకు ఉండాలి. కానీ ప్రస్తుతం 120 కేజీలు మాత్రమే ఉంది. భాస్వరం 30 నుంచి 35 కేజీల వరకు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం 300 కేజీలకు పైగా ఉంది. దీంతో పాటు పొటాష్ 200 నుంచి 270 కేజీల వరకు ఉండాలి. ప్రస్తుతం 180 కేజీలు మాత్రమే ఉంది. అంటే జిల్లాలోని నేలల్లో నత్రజని, పొటాష్ మోతాదుఉండావల్సిన దాని క న్నా తక్కువగా.. భాస్వరం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అదే విధంగా సూక్ష్మ పోషకాలు ఐరన్, జింక్, మాంగనీస్, బోరాన్ వంటివి తక్కువ మోతాదుల్లో ఉన్నాయి.
నేల స్వభావం
తెలుసుకొని సాగు చేయాలి
ప్రతీ రైతుకు తన భూమిలోని పోషకాలపై అవగాహన ఉండాలి. పోషకాల మోతాదు తెలుసుకొని పంటలు వేయాలి. నేలను తక్కువ లోతుకు దున్నాలి. సేంద్రియ ఎరువుల వాడకం, పచ్చిరొట్ట పంటలు వేయడం పెంచాలి. పంటలను కాల్చి వేయకుండా నేలలోనే కలియ దున్నాలి. పంట పంటకు మార్పు చేయాలి. పోషకాల సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
– క్రాంతి కుమార్, కేవీకే మల్యాల శాస్త్ర వేత్త
న్యూస్రీల్
కారణాలు ఇవే..
భూమి సారంలో తేడా రావడానికి అనేక కారణా లు ఉన్నా.. ప్రధానంగా రైతుల స్వయంకృతాపరాధంతోనే ఎక్కువ నష్టం జరుగుతుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. గతంలో తొలకరి వర్షాలకు ముందుగానే పెంట మట్టి, చెరువు మట్టి వేసేవారు. కానీ ఇప్పుడు అది మరిచిపోయారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత పెసర, నువ్వులు, జనుము మొదలైన పంటలు వేసే వారు. ఇప్పుడు ఆ పంటలు కానరావడం లేదు. పంటలను భూమిలో కలియ దున్నడం, గొర్రెలు, బర్రెల మందలు పెట్టేవారు. ఇప్పుడు అది లేదు. అదే విధంగా కాంప్లెక్స్ ఎరువులు డీఏపీ, 28–28, 24–24, 20–20, యూరియా వాడకం పెరిగింది. ధర ఎక్కువగా ఉందని పొటాష్ వాడకం తగ్గించారు. దీంతో నత్రజని, భాస్వరం, పొటాష్ తోపాటు సూక్ష్మఽ పోషకాల్లో కూడా వ్యత్యాసం వచ్చింది. దీంతో పంటలు సక్రమంగా ఎదగకపోవడం, పూత, కాత లేకపోవడం, వచ్చినా నిలువక పోవడం, పంట బలంగా ఉండకపోవడం, చీడ పీడల బెడద ఎక్కువగా రావడంతో పంటల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు.
జిల్లా నేలల్లో పోషకాల భేదం
ఎక్కువ రసాయన ఎరువుల
వాడకంతో సారం కోల్పోతున్న భూములు
ఏ పంట వేసినా.. దిగుబడులు అంతంతే
సాగు పద్ధతుల్లో మార్పు అనివార్యం

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025