దేవా.. కరుణామయా
గుడ్ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ యాత్రను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా చర్చీల్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శిలువలో క్రీస్తు పలికిన చివరి ఏడు మాటలను మత పెద్దలు వివరించారు. జిల్లా కేంద్రమైన కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, గుడూరు ప్రాంతాల్లోని ఆర్సీయం, సీఎస్ఐ, ఎబీఎం చర్చీల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాధాతప్త హృదయాలను కాపాడి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు అని మతపెద్దలు అన్నారు. కర్నూలులో శిలువ మోసి బిషప్ గోరంట్ల జ్వాన్వేష్ యాత్ర ప్రారంభించారు.


