21న శ్రీశైలం ఏపీఆర్‌ఎస్‌బీసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

21న శ్రీశైలం ఏపీఆర్‌ఎస్‌బీసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Dec 15 2025 9:18 AM | Updated on Dec 15 2025 9:18 AM

21న శ్రీశైలం ఏపీఆర్‌ఎస్‌బీసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

21న శ్రీశైలం ఏపీఆర్‌ఎస్‌బీసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కర్నూలు సిటీ: శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (బీసీ)1994–95 బ్యాచ్‌ పదో తరగతి విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21వ తేదీన జరుగనుంది. రాయలసీమ జిల్లాలోని పలువురు ఈ స్కూల్‌లో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. వారంతా ఈ సమావేశానికి రానున్నారు. కర్నూలు నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న కేవీఆర్‌ గార్డెన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఆదివారం వారు నాడు విద్యాబోధన చేసిన గురువుల ఇంటికి వెళ్లి ఆత్మీ య సమ్మేళనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గురువులను ఆహ్వానించిన వారిలో పూర్వ విద్యార్థులు డాక్టర్‌ శ్రీనివాసులు, డీఈఈ శివనాగరాజు, టీచర్‌ నాగశేషు, లక్ష్మణాచారి, మారెన్న, శ్రీరాములు, గాంధీ నాయుడు, గిడ్డయ్య, కృష్ణ, పరశురాముడు, రవి కిశోర్‌, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement