
ఆర్అండ్బీ కర్నూలు ఈఈగా సునీల్రెడ్డి
కర్నూలు(అర్బన్): రోడ్లు భవనాల శాఖ కర్నూలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా సీవీ సునీల్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన బి.సురేష్బాబును ప్రభుత్వం ఎస్ఈగా పదోన్నతి కల్పించి చిత్తూరుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా కోవెలకుంట్ల డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సునీల్రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేశారు. ఈఈగా బాధ్యతలు చేపట్టిన సునీల్రెడ్డికి ఈఈ సిద్దారెడ్డి, కార్యాలయ డీఏఓ ఓ పురుషోత్తంరెడ్డి, హెచ్డీ చంద్రశేఖర్బాబు, డివిజన్ పరిధిలోని డీఈఈ, ఏఈలు, కార్యాలయ సిబ్బంది పూలబోకేలు అందించి అభినందనలు తెలిపారు.