
యువకుడిపై లాఠీ నృత్యం
● అకారణంగా చితక్కొట్టిన
హెడ్ కానిస్టేబుల్
సంజామల: కూటమి ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నొస్సం గ్రామానికి చెందిన రమేష్బాబు అనే యువకుడిని కానిస్టేబుల్ విచక్షణా రహితంగా చితకబాదిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు.. ఈనె ల 19న నొస్సం గ్రామానికి చెందిన భరత్ మద్యం తాగి బస్టాండ్లో రోడ్డుపై అడ్డంగా బైక్ పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. అదే క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, మహిళా కండెక్టర్తో భరత్ వాగ్వాదానికి దిగాడు. దీంతో వారు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ పోలీసుకు సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్న రమేష్బాబు మహిళా కండెక్టర్కు భరత్తో సారీ చెప్పించి పంపించేశారు. ఈలోపు హెడ్కానిస్టేబుల్ నాగన్న, మరో ఇద్దరు పోలీసులు సాయంత్రం నొస్సం చేరుకుని భరత్ కోసం ఆరా తీశారు. అతడు కనపడకపోవడంతో రమేష్బాబును పోలీసు వాహనంలో పుచ్చయకాయపల్లె గ్రామ సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న రమేష్బాబును కుటుంబ సభ్యులు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొంది సాయంత్రం స్టేషన్కు చేరుకుని సీఐ హనుమంత్నాయక్ను కలిసి హెడ్కానిస్టేబుల్ నాగన్నపై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా విచారించి కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటామన్నారు.

యువకుడిపై లాఠీ నృత్యం