మహిళకు స్క్రబ్ టైఫస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): లారీల ఫిట్నెస్ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి చేయ తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు న్యూ ఆంధ్రా మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శేషగిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం లారీ యజమానులతో చర్చలు జరిగి, పెరిగిన రేట్లు హోల్డ్ చేస్తామని, నాలుగు రోజులు సమయం పడుతుందని కోరిన మీదట సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత సమస్యను పరిష్కరించకుంటే మళ్లీ యజమానులందరూ సమావేశమై భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
విజయవాడలీగల్: బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవానీ మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలో విజయనగర్ కాలనీలో తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో నివసించే ఫిర్యాది(16) కొంతకాలం హాస్టల్లో చదివి, కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటివద్దనే నివసిస్తోంది. ఈ క్రమంలో మారుతీనగర్లో నివసించే మెడేపల్లి సాయి కుమార్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. వారిరువురు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో 2021 జూలై 23వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సాయికుమార్ వచ్చి బయటకు వెళ్దామని చెప్పి గుణదల సమీపంలో హోటల్ నందు రూమ్కి తీసుకెళ్లి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇంటికి వచ్చి తల్లికి చెప్పగా, ఇద్దరూ కలిసి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేసిన అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2021 జూలై 26వ తేదీన మెడేపల్లి సాయి కుమార్ను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో సాయి కుమార్పై నేరం రుజువైనందున మంగళవారం విజయవాడ పోక్సో న్యాయమూర్తి వేల్పుల భవానీ నిందితుడికి పై విధంగా శిక్ష విధించారు.
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్
మహిళకు స్క్రబ్ టైఫస్


