కృష్ణా జిల్లాలో..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగింది. గురువారం ఉదయం 10 గంటల వరకూ పోలింగ్ బూత్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం నుంచి పోలింగ్ పుంజు కుంది. ఉదయం విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈఓ) వివేక్యాదవ్ పరిశీలించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి నాయకులు మధ్మాహ్నం నుంచి ఓటర్లలను ప్రలోభాలకు గురి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి గుంటూరులో ఈ నెల 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లాలోని 112 పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, జి.కొండూరుల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. దీంతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలోని 77 పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మచిలీపట్నంలోని హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ, పోలింగ్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు, సిబ్బందితో చర్చిస్తూ, తగు సూచనలు జారీ చేశారు.
బందరు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లోని బూత్లో బారులు తీరిన పట్టభద్రులు
మొత్తం ఓటర్లు: 63,114 పోలైన ఓట్లు: 44,131 పోలింగ్ శాతం