కాగజ్నగర్లో అయ్యప్ప ధర్మప్రచార సభ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని వాసవి మినీ ఫంక్షన్ హాలులో ఆదివారం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార జిల్లా సభ నిర్వహించా రు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లం రాజు హాజరై మాట్లాడారు. ధర్మ ప్రచా ర సభ ఆధ్వర్యంలో శబరిమల సమీపంలోని నారాయణతోడ్ సమీపంలో గల అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే పలు సేవా కా ర్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని కో రారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర కోశాధికారి రమేశ్, భిక్షపతి, ఈదుల జ్యోతిష్, విజయ్ కుమార్, సాయికృష్ణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


