ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రజలు ఆధ్యాత్మికను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బా బు అన్నారు. కాగజ్నగర్ పట్టణం న్యూకాలనీలోని గాయత్రీ మందిర్లో ఆదివారం గాయత్రీ పరివార్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 కుండీల మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయత్రీ పరివార్ గొప్ప ఆధ్మాతిక సమూహంగా ఏర్పడి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్రావు, ఎస్పీఎం జీఎం అనిల్కుమార్, హనుమంతరావు, రామకృష్ణ, లోకేశ్కుమార్, భక్తులు పాల్గొన్నారు.


