నవోదయలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జాతీ య విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ విద్యార్థుల విజ్ఞాన, సైన్స్ ప్రదర్శనలను తిలకించారు. బొగ్గుగని కార్మికుల భద్రత కోసం రూపొందించిన సేఫ్టీ క్యాప్, హైడ్రాలిక్ బ్రిడ్జ్ నమూనా వంటి వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ వి ద్యార్థుల్లో దాగి ఉన్న శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమావత్, ఇలయ్య, శిరీష, తిరుపతమ్మ, లక్ష్మణ్ పాల్గొన్నారు.


